ఈడీ నోటీసులు ప్రేమ లేఖలు

ఈడీ నోటీసులు ప్రేమ లేఖలు

ముంబై : మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ కు ఈడీ నోటీసులు పంపడం ప్రేమ లేఖల వంటివని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సోమవారం వ్యాఖ్యా నించారు. వాటిని మరణ శాసనాలుగా పరిగణించేది లేదన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను నిందించిన కేంద్రమంత్రి నారాయణ్ రాణే ను అరెస్ట్ చేసినందుకు ప్రతీ కారంగా మంత్రికి ఈడీ నోటీసులు పంపారని ఆరోపించారు. జీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్, మరికొందరిపై నమోదైన రూ.100 కోట్ల అక్రమాల కేసులో ఈడీ మంత్రి అనిల్ పరబ్ కు నోటీసులు పంపింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల ఇలాంటి ప్రేమలేఖలు ఎక్కువయ్యాయని సంజయ్ రౌత్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈడీ తరచుగా నోటీసులు పంపడం చూస్తుంటే… ఈడీ కార్యాలయంలో బీజేపీ మనిషైనా ఉండాలి, లేకపోతే బీజేపీ కార్యాలయంలో ఈడీ అధికారైనా పని చేస్తుండాలని ఎద్దే వా చేశారు. ఇలాంటి నోటీసులతో తమకేమీ కాదని, ఈడీ నోటీసులకు మంత్రి పరబ్ స్పందిస్తారని, విచారణకు సహకరిస్తారని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos