మమతకే శివసేన మద్ధతు

మమతకే శివసేన మద్ధతు

ముంబై : త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో శివసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గురు వారం వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో జరిగిన చర్చలో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు. ‘‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందా లేదా అని చాలా మంది ఆసక్తితో ఉన్నారు. వారికి నేనో విషయం స్పష్టం చేయదల్చు కున్నాను. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సూచనల మేరకు.. ప్రస్తుత తరుణంలో బెంగాల్లో దీదీ వర్సెస్ మిగతా మొత్తంగా ఉంది. అన్ని ‘ఎం’లు అంటే మనీ, మాఫియా, మీడియా అన్నీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉండాలని శివసేన నిర్ణయిం చుకుంది. ఆమె సింహ గర్జన లాంటి విజయాన్ని సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే బెంగాల్ నిజమైన శివంగి మమతా బెనర్జీనే’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. బెంగాల్కు 8 విడతల్లో పోలింగ్ పెట్టడాన్ని న్యాయవాది మనోహర్లాల్ శర్మ సుప్రీం కోర్టులో సవాలు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)కు ఇది పూర్తిగా భిన్నమైన చర్య అని ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos