ముంబై: మహారాష్ట్ర సచివాలయం వద్ద సోమవారం నాటకీయ పరిణామాలు సంభవించాయి. ఎన్సీపీ తిరుగుబాటు నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ను సచివాలయంలోని ఆయన గదిలో అటూ ఇటూ కదల కుండా కాసేపు ఎన్సీపీ నేతలు నిలువ రించినట్లు తెలిసింది. త్వరలో భాజపా-ఎన్సీపీ (అజిత్ వర్గం) బల పరీక్ష ఎదుర్కోను న్నందున ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో చర్చించారు. అనం తరం ఎన్సీపీ నేతలు ఆయనను ఆయన గదిలో కలిసి కాసేపు చుట్టు ముట్టి శరద్ పవార్తో మాట్లా డిం చినట్లు సమాచారం. అజిత్ను బుజ్జగించి తిరిగి తనవైపు తిప్పుకునేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సోమవారం ఉదయం ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్బల్ కూడా అజిత్ను కలసుకుని సొంత గూటికి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేలు 54 మందిలో 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు.