ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. జట్టు యాజమాన్యం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించకపోయినా, అది తీవ్ర గాయమేనని తెలిసింది. కనుక అతనికి నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సమాచారం. ఈరోజు రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్తో తలపడాల్సి ఉంది. దీని కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఫీల్డింగ్ సమయంలో డైవ్ చేసినప్పుడు కుడి కాలు కండరాలు పట్టేసింది. గ్రౌండ్లోనే విలవిల్లాడుతున్న రోహిత్ను జట్టు వైద్యుడు నితిన్ పటేల్ వచ్చి తీసుకెళ్లాడు. ప్రపంచ కప్పు నాటికి అతను కోలుకుంటాడని ముంబై ఇండియన్స్ ఆశాభావంతో ఉంది.