రొహింగ్యాలను పద్ధతి లేకుండా పంపించేయొద్దు

రొహింగ్యాలను పద్ధతి లేకుండా పంపించేయొద్దు

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా మయన్మార్కు పంపించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జమ్మూలో నిర్బంధంలో ఉన్న రొహింగ్యాలను వెంటనే విడుదల చేయాలని, వారిని మయన్మార్కు పంపించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపింది. మన దేశం చట్టవిరుద్ధ వలసదారులకు రాజధానిగా ఉండటం సాధ్యం కాదని కేంద్రం తెలిపింది.లిపింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. రొహింగ్యా బాలలను మయన్మార్ సైన్యం చంపుతోందని, రొహింగ్యాలను లైంగికంగా వేధిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ మానవతావాద చట్టాలను మయన్మార్ సైన్యం గుర్తించడం లేదని ఆక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos