హోసూరులో తారు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

హోసూరులో తారు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

హోసూరు : హోసూరు యూనియన్‌లో రూ.50 లక్షల ఖర్చుతో తారు రోడ్ల నిర్మాణానికి యూనియన్ చైర్‌పర్సన్‌ శశి వెంకటస్వామి శుక్రవారం భూమి పూజ చేశారు. హోసూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన మోస్తరు వర్షానికి పలు ప్రాంతాలలో రోడ్లు గుంతల మయమయ్యాయి. ఇచ్చంగురు,  సేవగానపల్లి పంచాయతీలలో రూ.50 లక్షల ఖర్చుతో తారు రోడ్ల నిర్మాణానికి యూనియన్ చైర్‌పర్సన్ నిధులను కేటాయించారు. భూమి పూజ సందర్భంగా చైర్‌పర్సన్‌ శశి వెంకటస్వామి మాట్లాడుతూ హోసూరు యూనియన్‌లోని అన్ని ప్రాంతాలలో రోడ్లు నిర్మించడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. యూనియన్‌లోని గ్రామాల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చంగురు పంచాయితీ అధ్యక్షురాలు పద్మావతి చంద్రశేఖర్, సేవగానపల్లి పంచాయితీ అధ్యక్షురాలు మమత వెంకటేశ్‌, 5వ వార్డు జిల్లా కౌన్సిలర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos