రోడ్డ ప్రమాదంలో కరీం నగర్ వాసుల మృతి

రోడ్డ ప్రమాదంలో కరీం నగర్ వాసుల మృతి

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన కుటుంబ సభ్యులు మరణించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీ కొట్టడంతో అయిదు మంది అక్కడికక్కడే మరణించారు. మృతులు కరీంనగర్‌లోని మంగమ్మ తోటకు చెందిన వంశీ, ఆయన భార్య, కుమారుడు, అత్త మామలుగా గుర్తించారు. కరీంనగర్‌ నుంచి తిరుపతికి దైవ దర్శనానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కావలి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos