హోసూరు : బడదేపల్లి పంచాయితీ దేవిశెట్టి పల్లి గ్రామంలో రూ.7 లక్షల ఖర్చుతో గ్రామస్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఆర్వో ప్లాంటును ప్రారంభించారు. 2018.19 శాసనసభ్యుని నిధుల ద్వారా దేవిశెట్టి పల్లి గ్రామంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభానికి మాజీ మంత్రి బాలకృష్ణారెడ్డి చర్యలు చేపట్టి రూ.7 లక్షలను కేటాయించారు. ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ చైర్పర్సన్ శశి వెంకటస్వామి హాజరై, ప్లాంటును ప్రారంభించారు. దేవిశెట్టి పల్లి గ్రామస్థులకు రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు శశి వెంకటస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో బడదేపల్లి పంచాయతీ అధ్యక్షులు మురుగేష్, ఉపాధ్యక్షులు జ్యోతి ప్రభాకర్, గ్రామస్థులు పాల్గొన్నారు.