ఎన్డీయేకు మరో మిత్ర పక్షం దూరం

ఎన్డీయేకు మరో మిత్ర పక్షం దూరం

జైపూర్ : రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్కు చెందిన భాజపా మిత్ర పక్షం- లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ మంగళవారం ఇక్కడ హెచ్చరించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సోమవారం రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలకు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్లో బలమైన సామాజిక వర్గం మద్దతు కలిగిన ఆర్ఎల్పీ కి దాదాపు 15 లోక్సభ స్థానాల్లో ప్రామబల్యాన్ని కలిగి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos