సామాన్యులకు న్యాయం దూరమవుతోంది

సామాన్యులకు న్యాయం దూరమవుతోంది

జైపూర్ :ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న భారీ ఫీజుల పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ శనివారం జరిగిన 18వ అఖిల భారత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశంలో ప్రసంగించారు. ఇది దేశంలో పేదలు, సామాన్యులకు న్యాయం అందకుండా చేసినట్లవుతుందన్నారు. ‘‘డబ్బున్న వారు పెద్ద లాయర్ల ఫీజులను భరించగలరు. సుప్రీంకోర్టు లాయర్లు కొందరు వసూలు చేసే ఫీజులను సామాన్యులు చెల్లించుకోలేరు. వారు ఒక్కో విచారణకు రూ.10-15 లక్షల చార్జీ వసూలు చేస్తుంటే సామా న్యులు ఎలా చెల్లించుకోగలరు?’’ అని ప్రశ్నించారు. పార్ల మెంటు వర్షాకాల సమావేశాల్లో వాడుకలో లేని 71 చట్టాలను రద్ధు చేయను న్నట్టు తెలిపారు. ఇదే సమావేశంలో ప్రసంగించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మ విషయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య లకు వ్యతిరేకంగా నడుస్తున్న ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బేరసారాల ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారంటూ బీజేపీపై మరోసారి విమర్శలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos