హిజ్బుల్ కమాండర్ రియాజ్ నాయకూ హతం

హిజ్బుల్ కమాండర్ రియాజ్ నాయకూ హతం

శ్రీనగర్ : ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ ను పోలీసులు బుధ వారం హతం చేసారు.ఇటీవల అతడు తన స్వగ్రామం బెయ్పొరకు వచ్చినట్లు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన దళాలు మంగళవారం రాత్రి ఆ ముష్కరుడు ఉన్న ఇంటిని చుట్టు ముట్టాయి. ఆత్మరక్షణకు ఉగ్రవాది కాల్పులు ప్రారంభించడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఉపాధ్యాయుడిగా పనిచేసిన రియాజ్ 33 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్ తీసుకున్నాడు. మరో ముష్కరుడు జాకీర్ ముసా హిజ్బుల్ నుంచి వేరుపడిన తర్వాత సంస్థలో రియాజ్ ప్రముఖుడయ్యాడు. లోయలో యువకుల్ని ఉగ్రవాదంవైపు ఆకర్షించడంలోనూ విశిష్ట పాత్ర పోషిస్తు న్నాడు. స్థానిక స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(ఎస్పీఓ)ను బెదిరించి రాజీనామా చేయించడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos