ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ రాజకీయ జీవితంపై తెరకెక్కించిన చిత్రం అనేక వివాదాలకు కారణమైంది.ఎన్నికల నేపథ్యంలో చిత్రాన్ని నిలిపివేయాలంటూ తెదేపా నేతలు కోర్టుకు,ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తామేమి చేయలేమంటూ కోర్టు,ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో అన్ని అవరోధాలు దాటుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ శుక్రవారం వెండితెరలను తాకనుంది.చాలా కాలం తర్వాత తన చిత్రాన్ని హైప్ రావడంతో దర్శకుడు ఆర్జీవీ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు.చిత్రానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ట్విట్టర్లో పొందుపరుస్తూ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరవయ్యేలా చేయడంలో సఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో చిత్రం ప్రదర్శించనున్న ఏఎంబీ మల్టిప్లెక్స్లో చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్కు మంచి స్పందన వస్తున్నట్లు ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.ముందస్తు బుకింగ్లు ప్రారంభమైన పది నిమిషాల్లోనే వెయ్యి టికెట్ల అమ్ముడయ్యాయంటూ ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.వెయ్యి టికెట్లను బుక్ చేసుకున్న వ్యక్తులు స్వర్గీయ ఎన్టీఆర్కు నిజమైన అభిమానులని వారు మహానటుడికి నకిలీ అభిమానులు కాదని ట్వీట్ చేశాడు.ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్బోర్టు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించడం సినీవర్గాలతో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరచింది..