కరోనా కిట్ల అక్రమార్కుల్ని శిక్షించాలి

కరోనా కిట్ల అక్రమార్కుల్ని శిక్షించాలి

న్యూ ఢిల్లీ : కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోళ్ల లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యల్ని తీసుకోవాలాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం చేసిన ట్వీట్లో ప్రధాని మోదీని డిమాండు చేసారు. అసలు ధర కంటే 145 శాతం అధిక ధరకు కిట్లను కొన్నారని ఆరోపణలు వెల్లు వెత్తాయి. ‘కరోనా రక్కసి వల్ల లక్షలాదిగా సోదరులు, సోదరీమణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని….. ఇలాంటి తరుణంలో కూడా లాభాల గురించి ఆలోచించడం దారుణం. కరోనా కిట్ల అవినీతి పట్ల ప్రతి భారతీయుడు సిగ్గుపడుతున్నాడు. మోదీ తక్ష ణమే స్పందించి అవినీతిపరులను చట్టం ముందు నిలబెట్టాల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos