అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో సంస్థ అధ్యక్షుడు రామోజీరావుతో భేటీ కావటాన్ని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి గురువారం ట్విట్టర్లో ప్రశ్నించారు. ‘ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్లో వెళ్లి ఆయనను కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?’ అని వ్యాఖ్యానించారు.