చదువు లేని మోదీ అనాలోచిత నిర్ణయమే అగ్నిపథ్

చదువు లేని మోదీ అనాలోచిత నిర్ణయమే అగ్నిపథ్

హైదరాబాదు : ప్రధాని మోదీ చదువు లేని వ్యక్తి అని, అందుకే అగ్నిపథ్ లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘బీజేపీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నమేమీ కాదని, సైనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మోదీకి, బీజేపీకి తెలియదు. ఇతర దేశాలు దాడులు చేస్తే ప్రతిదాడులకు సైన్యాన్ని వినియోగిస్తారు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులు రంగంలోకి దిగుతారు. అగ్నిపథ్ కింద నాలుగేళ్ల పాటు ఆయుధాలు వాడడంపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపిస్తే ఎలా బతుకుతారు. వెంటనే అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతి అంశంలోనూ అయోమయం సృష్టించి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింద’ని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos