ముంబై : కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సమూల మార్పులు రావాలని నూరు మంది పార్ల మెంటు సభ్యులు పార్టీ అధినేత సోనియా గాంధీని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత సంజయ్ ఝా వెల్లడించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘పార్టీ నాయకత్వంలో మార్పులు తేవాలని, సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక పారదర్శకంగా జరగాలని దాదాపు 100 మంది ఎంపీలు సోనియాకు లేఖ రాసార’ని వివరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సంజయ్ ఝాను నాయకత్వం జూలైలో పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన యువనేత సచిన్ పైలట్కు మద్దతిస్తున్నారు