ముంబయి : విదేశాలకు దొంగతనంగా ఎగుమతి చేసేందుకు నిల్వచేసిన 2,200 రెమ్డెసివిర్ వయల్స్ను పోలీసులు, ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ) అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు అందేరీలోని మరోల్ ప్రాంతంలో 2,000, న్యూ మెరైన్ లైన్స్లో మరో 200 వయల్స్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసుల అధికార ప్రతినిధి చైతన్య తెలిపారు. వీటిని ఆసుపత్రులకు అందిస్తామన్నారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎఫ్డీఏ అధికారుల సమన్వయంతో సోదాలు నిర్వహిం చినట్లు డీసీపీ మంజనాథ్ పేర్కొన్నారు. కరోనా చికిత్సలో కీలకమైన రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎగుమతులపై కేంద్రం గత వారం నిషేధం విధించింది.