శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ విభజన, ప్రత్యేక ప్రతిపత్తి రద్దు సంద ర్భంగా విధించిన నిషేధాజ్ఞల్ని శుక్రవారం ముస్లింల ప్రార్థనల కోసం కేంద్రం సడలించే అవకాశమున్నట్లు తెలిసింది. సోమవారం బక్రీద్ పర్వ దిననా కూడా నిషేధాజ్ఞలను సడలించదలచారు. ఇంకా అంత ర్జాల, చరవాణి సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించే అవకాశ ముంది. లోయలోని పరిస్థితులను జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ స్వయంగా పరిశీలిస్తున్నారు.