తెరాస, భాజపాలను బహిష్కరించండి.

తెరాస, భాజపాలను బహిష్కరించండి.

ఆమ్రాబాద్ (నాగర్ కర్నూలు): యురేనియాన్ని వెలికితీస్తే నల్లమల అటవి ప్రాంతమే కాకుండా తెలంగాణ పర్యావరణం మొత్తం దెబ్బతింటుందని మల్కాజిగిరి లోక్సభ సభ్యుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన చెందారు. నల్లమలలో యురే ని యం అన్వేషణకు అనుమతులు జారీ కావటంతో శనివారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో పర్యటించిన తర్వాత విలేఖ రుల తో మాట్లాడారు. ‘యురేనియాన్ని వెలికితీయడం వల్ల నల్లమలలోని అరుదైన వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, గిరిజన జాతులకు నష్టం వాటి ల్లుతుం ది. తవ్వకాలతో వెలువడే అణు ధూళితో కృష్ణ జలాలు కలుషితమవుతాయి. వాటిని తాగిన ప్రజలు వ్యాధుల బారినపడతారు. ప్రజలు సంఘ టితమై సర్వేకు వచ్చే అధికారులను అడ్డుకోవాలి. యురేనియం సర్వే అనుమతులను విరమించుకుంటున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేసేవరకు నల్లమలలో తెరాస, భాజపా నాయకులను సాంఘిక బహిష్కరణ చేయాల’ని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos