బెంగళూరు
: ఐపీఎల్లో ఈసారి కూడా కప్పు గెలుచుకోలేకపోయినందుకు ఆర్సీబీ పశ్చాత్తాపం వ్యక్తం
చేసింది. మీ అంచనాలను అందుకోలేకపోయాం…మన్నించండి అంటూ అభిమానులకు ఓ సందేశం ఇచ్చింది.
‘ఈసారి కూడా ఆర్సీబీని ప్లేఆఫ్స్కు తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. మాకు మద్దతిస్తూ, మాతోనే
ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మీ మద్దతు మాకు చాలా అవసరం` అని ఓ భావోద్వేగపూరిత
వీడియోను ఆర్సీబీ యాజమాన్యం ట్విట్టర్లో పోస్టు చేసింది. రాజస్థాన్తో జరిగిన అయిదు
ఓవర్ల మ్యాచ్లో ఎటువంటి ఫలితం రాకపోయినా, ఆ మ్యాచ్ను ఎప్పటికీ మర్చిపోలేనని డివిలియర్స్
తెలిపాడు. వచ్చే సీజన్లో కచ్చితంగా మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తామని, దానికి
మీ మద్దతు అవసరమని కోహ్లీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. కాగా 13 మ్యాచుల్లో కేవలం నాలుగు
విజయాలు మాత్రమే సాధించి ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం హైదరాబాద్తో
లాంఛనంగా ఓ మ్యాచ్ను ఆడనుంది.