బ్యాంకులకు రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టిన 25 తెలుగు సంస్థలు

బ్యాంకులకు రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టిన 25 తెలుగు సంస్థలు

ముంబై : తెలుగు రాష్ట్రాలకు చెందిన 25 సంస్థలు బ్యాంకులకు రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళ వారం ప్రకటిం చింది. సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థకు సమాచార హక్కు చట్టం ద్వారా బ్యాంకు ఈ విషయాల్ని తెలిపాయి. 2020 సెప్టెంబర్ 30 నాటికి దేశ వ్యాప్తంగా 296 సంస్థలు రూ.లక్షా 25 వేల కోట్లు ఎగ్గొట్టాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 25 పెద్ద సంస్థలు రూ.9,975 కోట్లను ఎగవేశాయి. దేశవ్యాప్తంగా 2,203 సంస్థలు ఆర్థిక మోసాలకు పాల్పడి రూ.1.66 లక్షల కోట్లు ఎగవేశాయని పేర్కొంది. డెక్కన్ క్రానికల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,801 కోట్లు, వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,331 కోట్లు, హైదరాబాద్ కు చెందిన టెలికాం సర్వీసెస్ కంపెనీ బీఎస్ లిమిటెడ్ రూ.754 కోట్లు వంచించాయి. తెదేపా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ గ్రూప్ కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారేనని ఆర్బీఐ తన జాబితాలో వెల్లడించింది. ప్రజలు డిపాజిట్ చేసుకున్న సొమ్ము నుంచి సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇచ్చాయని, వారి నుంచి రుణాలు వసూలు చేయలేకపోతే వెంటనే ప్రజలకు వారి సొమ్మును తిరిగిచ్చేయాలని ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. ఎగవేతదారుల కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టాలకు సవరణ చేయాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos