కర్ణాటక నైపుణ్యాభివృద్ధి ప్రాధికార అధ్యక్షురాలుగా రత్నప్రభ

కర్ణాటక నైపుణ్యాభివృద్ధి ప్రాధికార అధ్యక్షురాలుగా రత్నప్రభ

బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కే. రత్నప్రభ కర్ణాటక నైపుణ్యాభివృద్ధి ప్రాధికార అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రత్నప్రభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలో ఐటీ కార్యదర్శిగా  పని చేశారు. తదనంతరం కే. రోశయ్య, నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలలో కూడా వివిధ హోదాల్లో పని చేసిన అనంతరం కర్ణాటకకు బదిలీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆమె లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos