నువ్వు హీరోయిన్ ఏంటో మా కర్మ..

  • In Film
  • October 13, 2019
  • 183 Views

సంక్రాంతి బరిలో చిత్రాన్ని నిలపడానికి సరిలేరు నీకెవ్వరు చిత్రం దర్శక నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పనుల్లో వేగం పెంచిన దర్శక నిర్మాతలు మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు.కాగా ఈ చిత్రంలో మహేశ్ బాబుకు జోడీగా నటిస్తున్న క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నపై మహేశ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.మహేశ్ పక్కన నువ్వు సరిపోవని,నిన్ను ఎలా భరించాలో నువ్వు హీరోయిన్ ఎంటో మా ఖర్మ అంటూ రష్మికపై ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ ట్రోల్స్ వెనుక కారణం ఏంటంటే.. దసరా సందర్భంగా చిత్ర బృందం చిత్రంలో మహేశ్ పోస్టర్ విడుదల చేసింది.ఈ పోస్ట్‌ను మహేష్, రష్మిక, విజయశాంతి, దేవిశ్రీప్రసాద్,రత్నవేలు, అనీల్ సుంకర ఇలా సినిమాకి చెందిన ప్రముఖులందరినీ ట్యాగ్ చేశారు.ఈ ట్వీట్‌కు రీట్వీట్ చేసిన రష్మిక ‘హ్యాపీ దసరా’ అంటూ రెండు ఎమోజీకు పెట్టి ఊరుకుంది.రష్మిక ట్యాగ్స్ ఇవ్వకపోవడం మహేష్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ఫ్యాన్స్ ఆమెని టార్గెట్ చేశారు. కనీసం సినిమా పేరుని కూడా ట్యాగ్ చేయడం తెలియదా..? అంటూ మండిపడ్డారు. మహేష్ బాబు ట్విట్టర్ ట్యాగ్ ఎక్కడ..? అంటూ ప్రశ్నించారు. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే రీట్వీట్ చేయకుండా ఆలస్యం చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే.. ‘నిన్ను మా అన్న పక్కన ఎలా భరించాలో..నువ్ హీరోయిన్ ఏంటో మా కర్మ’ అంటూ దారుణంగా రష్మికని ట్రోల్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos