యువతిపై 25మంది అత్యాచారం

చండిగడ్: పల్వాల్ జిల్లాలో యువతిపై 25మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు ఫేస్బుక్ ద్వారా యువతికి పరిచయమయ్యాడు. కలుద్దామని చెప్పి.. తనను అపహరించి రామ్గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే 25మంది రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.తర్వాతి రోజు ఉదయం ఆమెపై మరోసారి అత్యాచారం చేసి బదార్పుర్ సరిహద్దు వద్ద వదిలేసి పారిపోయారు నిందితులు. ఈ ఘటన మే 3న జరిగిందని బాధితురాలు పోలీసులకు వివరించింది. యువతి అందించిన వివరాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos