కొలంబో : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నిక య్యారు.బుధవారం ఈ పదవికి జరిగిన ఎన్నికలో 221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి. అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు, వామపక్షానికి చెందిన అనురా దిసానాయకు మూడు ఓట్లు లభించాయి. మొదటి ప్రాధాన్యత ఓటింగ్ లోనే రణిల్ కు పూర్తి మెజారిటీ లభించింది. ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి ఓట్లు చెల్లుబాటు కాలేదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, తమ ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని రణిల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.