ఒక్క రామాలయమైనా కట్టావా మోదీ?

కోల్కతా: ప్రధాని మోదీ ‘జై శ్రీరామ్’అని నినదిస్తుంటారు. ఒక్క రామమందిరమైనా నిర్మించారా అని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమత బెనర్జి మంగళవారం ప్రధానిపై నిప్పులు చెరిగారు.‘భాజపా బాబు (నరేంద్రమోదీ) మీరు తరుచూ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తుంటారు. కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక్క రామ మందిరమైనా కట్టించారా? ‘జై శ్రీరాం’ అనేది భాజపానినాదంగా మారిపోయింది. భాజపా నినాదాలను మేమెందుకు పాటించాలి? ఎన్నికలు రాగానే శ్రీరాముడు భాజపా ఎన్నికల ఏజెంట్‌గా మారిపోతారా? ప్రతి ఒక్కరూ దాన్నే నినదించేలా వారు ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న మమతా బెనర్జీ వాహన శ్రేణిని కొందరు వ్యక్తులు ‘జై శ్రీరాం’ అని నినదిస్తూ అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసారు. ఎన్నికల ప్రచార సభలో మోదీ ఈ చర్యను ఖండించారు. ‘జై శ్రీరాం’ అని అంటే తనను కూడా అరెస్టు చేయిస్తారా అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos