న్యూ ఢిల్లీ : రైతు ఆందోళనలు అణచివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని బీఎస్పీ సభ్యుడు సతీశ్ మిశ్రా శుక్రవారం రాజ్యసభలో ఆరోపించారు. ‘వారికి నీళ్లు, విద్యుత్ను అందకుండా చేశారు. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా శౌచాలయాలు తొలగించారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంద’ని దుయ్యబట్టారు. రైతుల నిరసన స్థలాల వద్ద రోడ్లపై మేకులు కొట్టారని, అన్నదాతలను శత్రువులుగా చూస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్వార్థాన్ని వీడి మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.