ముంబై: నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నివాస భవనం-రాజ్గృహ ను గుర్తు తెలియని వ్యక్తులు మంగళ వారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేసారు. ఈ దుర్ఘటనను హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఖండించారు.‘అంబేడ్కర్ నివాసంపై దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. దాడికి పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాం’అని భరోసా ఇచ్చారు.‘ రాజ్గృహ వెలుపల ప్రజలెవరూ చేరవద్దని, ప్రజలు సంయమనంతో ఉండాలి. ఇది చిన్న ఘటన అని, శాంతియుతంగా ఉండాల’ని అంబేడ్కర్ మనవళ్లు ప్రకాశ్ అంబేడ్కర్, భీంరావ్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు.