న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ ఉద్ధృతితో దేశంలో అర్థిక వ్యవస్థలు కుప్పకూలిన వేళ కార్పొరేట్ ఆస్తులు, ఆదాయాలు ఎలా పెరిగాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్న పాలకులు పేదలకు రేషన్, నగదు ఇవ్వాలనే విషయాన్ని అటక ఎక్కించిందని ఆగ్రహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, ప్రముఖ కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం వెబినార్ లో ప్రసంగించారు. కరోనా నియంత్రణలో కేంద్రం అవలంబిస్తున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు.