అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే జూన్ 10కి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న అండమాన్, దక్షిణ బంగాళా ఖాతాన్ని అనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. జూన్ 1 కి కేరళ, జూన్ 10లోగా ఆంధ్రప్రదేశ్ లో రానున్నాయి. ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా మధ్య త మిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడినా, దక్షిణ కోస్తాలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.