జూన్‌ 10 కి నైరుతి రుతుపవనాల రాక

జూన్‌ 10 కి నైరుతి రుతుపవనాల రాక

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే జూన్ 10కి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న అండమాన్, దక్షిణ బంగాళా ఖాతాన్ని అనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. జూన్ 1 కి కేరళ, జూన్ 10లోగా ఆంధ్రప్రదేశ్ లో రానున్నాయి. ఛత్తీస్ఘడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా మధ్య త మిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడినా, దక్షిణ కోస్తాలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos