కీలక సమయంలొ వికెట్లను కొల్పోవడం వల్లే హైదరాబాద్ తో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెన్నై స్టాండిన్ కెప్టెన్ రైనా తెలిపాడు. మరిన్ని పరుగులు చేసి ప్రత్యర్థికి ఇంకా పెద్ద లక్ష్యాన్ని విధించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి ఈ ఓటమి మేలుకొలుపు లాంటిదని పేర్కొన్నాడు. వచ్చే మాచ్ కు ధొనీ సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మాచ్ లో చెన్నై ఓడిపొయిన సంగతి తెలిసిందే. నడుం నొప్పి కారణంగా ధొ నీ ఈ మాచ్ ఆడలేదు.