మరో మూడు రోజులు జడి వానలు

మరో మూడు రోజులు జడి వానలు

అమరావతి: వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మొగల్తూరులో 5.8 సెంటీమీటర్లు, కాకినాడలో 5.7, తాళ్లరేవులో 5.3, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 5.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా శివలలో 4.7, నెల్లూరు జిల్లా రేవూరులో 4.6, అనకాపల్లి జిల్లా గోలుకొండలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos