విలాస విమానాల్లో మోదీ – గడ్డ కట్టించే చలిలో జవాన్లు

విలాస విమానాల్లో మోదీ – గడ్డ కట్టించే చలిలో జవాన్లు

న్యూ ఢిల్లీ : ‘బుల్లెట్ ప్రూఫ్ లేని ట్రక్కుల్లో జవాన్లను పంపుతుండటంతో వారు అమర వీరులు అవుతున్నారు. ప్రధాని మాత్రం రూ.8,400 కోట్ల విమానంలో వెళ్తారు. ఇదేమి న్యాయమ’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ఒక ట్వీట్లో విమర్శించారు. సైనికులతో వెళ్తున్న ఒక వాహనానంతో పాటు, ప్రమాదానికి అవకాశమున్న నాన్ బుల్లెట్ ఫ్రూవ్ కార్లలో వారిని ఎలా పంపుతారని కొందరు చర్చించు కుంటున్న ఒక వీడియోనూ ట్వీట్కు జత చేశారు. ‘ఒకవైపు రూ.8,000 కోట్లు విలువ చేసే రెండు విమానాలను ప్రధాని మోదీ కొనుగోలు చేశారు. మరోవైపు చైనా మన సరిహద్దుల్లో ఉంది. మన భద్రతా బలగాలు గడ్డ కట్టించే చలిలో అత్యంత సాహసంతో సరిహద్దుల్లో పహరా కాస్తున్నారు’ అని గత వారం పంజాబు బహిరంగ సభలో అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos