భారతీయతను నిరూపించుకోవాలా… ?

భారతీయతను నిరూపించుకోవాలా… ?

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలతో మోదీ సర్కార్‌ దేశంలో సమస్యలను పక్కదారి పట్టిస్తున్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. తాను భారతీయుడనని నిర్ధారించేందుకు నరేంద్ర మోదీ ఎవరని ప్రశ్నించారు. ఎవరు భారతీయులో, వరు కాదో నిర్ణయించాలని ఆయనకు ఎవరు లైసెన్స్‌ ఇచ్చారని నిలదీశారు. తాను భారతీయుడినని తనకు తెలుసునని, ఎవరికో దీన్ని నిరూపించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. కేరళలో తన నియోజకవర్గం వయనాద్‌లోని కల్పెట్టా ప్రాంతంలో రాహుల్‌ పర్యటించారు. నిరుద్యోగం, ఉద్యోగాల గురించి ప్రశ్నించినప్పుడల్లా మోదీ అనూహ్యంగా ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలతో ఉద్యోగాలు రావని, సమస్యలతో రగులుతున్న కశ్మీర్‌, అసోంలు మన యువతకు ఉద్యోగాలను తెచ్చిపెట్టలేవని ఎద్దేవా చేశారు. నాథూరాం గాడ్సేను విశ్వసిస్తానని చెప్పే ధైర్యం మోదీకి లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రదర్శనలోనూ పాల్గొన్న రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌ విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos