ఖీర్ భవానికి రాహుల్ పూజలు

ఖీర్ భవానికి  రాహుల్ పూజలు

శ్రీ నగర్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం గందర్ బల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేవాలయం సందర్శన తర్వాత రాహుల్ గాంధీ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హజరత్ బల్ దర్గాను కూడా సందర్శించారు. శ్రీనగర్ లోని ఎంఏ రోడ్డు వద్ద కాంగ్రెస్ భవన్ ను ప్రారంభిం చారు.  జమ్మూ-కశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ కుమారుడి వివాహ విందుకు హాజరైన రాహుల్ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించి పార్టీ నేతలను కలుస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos