ఇంకా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ వెతలు

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా నిరుడు విధించిన లాక్డౌన్ వల్ల ఎదురైన కష్టాలు దేశ ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ దూరదృష్టి లోపం, అసమర్ధత వల్ల లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కుటుంబాలకు ట్విట్టర్ వేదికగా సానుభూతి తెలిపారు. కరోనా కారణంగా శిశువులు, గర్భిణుల మరణాలు ఆసియాలోని ఆరు ప్రఖ్యాత దేశాల్లో కంటే భారత్లోనే ఎక్కువ నమోదు కానున్నాయని యునిసెఫ్ వెల్లడించిన నివేదికపైనా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos