న్యూ ఢిల్లీ : భారత్లో కరోనా నియంత్రణకు మనకు తగినంత సమయం ఉన్నా సరిగ్గా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా బాధాకరం. కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశం ఉన్నా, గంభీరంగా తీసుకుని సన్నద్ధమవడంలో విఫలమయ్యాం. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చప్పట్లు కొట్టాలని పిలుపు ఇచ్చిందన్న ఓ వైద్యుడి ట్వీట్ను ప్రస్తావించారు. భవన నిర్మాణ రంగ కార్మికులతో పాటు అసంఘటితరంగ కార్మికులను ఆదుకునేందుకు వారికి నగదు సాయం సహా పలు తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.