రామాలయ ప్రతిష్ఠను రాజకీయం చేశారు

రామాలయ ప్రతిష్ఠను రాజకీయం చేశారు

కోహిమా : అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపనను ఎన్నికల వేళ బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఆరోపించారు. ఈ కార్యక్రమం ప్రధాని మోదీ, ఆర్ఎ్సఎస్ చుట్టూనే తిరుగుతోందన్నారు. ‘‘అందువల్లే దీనికి హాజరు కానని మా అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు. హిందూమతానికి చెందిన పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఇది రాజకీయ కార్యక్రమమని బహిరంగంగానే చెప్పారు. అందుచేత దీనికి మేం హాజరవడం కష్టం. అయితే రామాలయాన్ని సందర్శించదలచుకుంటే నిరభ్యంతరంగా వెళ్లవచ్చని మా భాగస్వామ్య పక్షాలకు, మా పార్టీలోని వారికి కూడా స్పష్టం చేశాం’’ అని రాహుల్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల 14న మణిపూర్లోని తౌబల్లో ఆయన ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సోమవారం నాగాలాండ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తమ ‘ఇండియా’ కూటమి పటిష్ఠంగా ఉందని.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. టీఎంసీతో విభేదాలను ప్రస్తావించగా.. భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీట్ల సర్దుబాటు చర్చలు కూడా బాగానే జరుగుతున్నాయని తెలిపారు. రాహుల్ న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లో వంద నియోజకవర్గాల గుండా సాగుతుంది. నిరుడు రాహుల్ నిర్వహింయిన ‘భారత్ జోడో యాత్ర’ పూర్తిగా పాదయాత్ర కాగా.. ఈ దఫా ఎక్కువగా బస్సు ద్వారా జరుగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర కూడా చేపడతారు. 6,713 కిలోమీటర్ల మేర సాగి.. మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos