గురుద్వారాలో రాహుల్ గాంధీ పూజలు

గురుద్వారాలో రాహుల్ గాంధీ పూజలు

ముంబై : కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మంగళవారం నాందేడ్లో గురు నానక్ ఆశీర్వాదాలతో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. గురు నానక్ జయంతి సందర్భంగా గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేహ్ సింగ్ జీ నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆయన గురు నానక్ గురు పూరబ్ ఆర్దాస్ సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్లో, గురు ఆశీర్వాదాలతో పాదయాత్రను గురుద్వారా యాద్గారి బాబా జోరవర్ సింగ్ జీ ఫతేహ్ సింగ్ జీ నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ లో ‘మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రను ప్రారంభించాం. గురు పూరబ్ శుభ సందర్భంగా గురుద్వారా యాద్గారీ బాబా జోరవర్ సింగ్ జీ, ఫతేహ్ సింగ్ జీలో అర్దాస్ చేసాము. గురు నానక్ ప్రేమ, శాంతి, సోదర భావం నుంచి స్ఫూర్తిని పొందుతూ భారత దేశాన్ని ఏకం చేయాలనే సంకల్పాన్ని నెరవేరుస్తాం. ప్రజలందరికీ గురుపూరబ్ సందర్భంగా శుభాకాంక్షలు’ తెలిపారు. భారత్ జోడో యాత్ర సోమవారం రాత్రి తెలంగాణా నుంచి మహారాష్ట్రలో ప్రవేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos