హొసూరు : సూళగిరి సమీపంలోని మేడిపల్లి గ్రామంలోకి శుక్రవారం అనుకోని అతిథి వచ్చింది. ఎనిమిది అడుగులున్న కొండ చిలువ రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు వెంటనే సమాచారాన్ని చేరవేశారు. అరుణ్ రాజ్ నేతృత్వంలో దానిని పట్టుకుని బిక్కన పల్లి అడవిలో వదిలి వేశారు. దీంతో గ్రామస్థులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.