గొర్రెను భోంచేసిన కొండ చిలువ

గొర్రెను భోంచేసిన కొండ చిలువ

హొసూరు : ఇక్కడికి సమీపంలోని తిప్పేపాళ్యంలో ఓ గొర్రెను కొండ చిలువ సుష్టుగా ఆరగించింది. సోమవారం అటు వైపు గొర్రెల మంద మేతకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక గొర్రె కనిపించకపోవడంతో కాపరి మునిరాజు అన్వేషించడం మొదలెట్టాడు. అక్కడే ముళ్ల పొదలో కొండచిలువ గొర్రెను మింగుతుండడం చూసి పరిగెత్తి గ్రామంలోకి వెళ్లి విషయం తెలియజేశాడు. గ్రామస్థులు మూకుమ్మడిగా రావడం చూసిన కొండ చిలువ మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఈ సంఘటన గ్రామంలో సంచలనం రేకెత్తించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos