గోడౌన్‌లో కొండచిలువ

హొసూరు : హొసూరు సమీపంలోని సూలగిరి ప్రభుత్వ బియ్యపు గిడ్డంగిలో చేరిన కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. సూలగిరిలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బియ్యపు గిడ్డంగి ఉంది. ఈ గిడ్డంగిలో బియ్యం నిల్వ చేసి రేషన్ సాపులకు సరఫరా చేస్తారు. సోమవారం ఈ గిడ్డంగిలో సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువ బస్తాలకింద చేరి బుసలు కొడుతూ కూలీల కంటపడింది. వెంటనే దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos