కేశినేని నానిపై పీవీపీ ఫైర్..

కేశినేని నానిపై పీవీపీ ఫైర్..

తన పరువు,మర్యాదలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించారంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై లోక్సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడంపై డీపీ ఎంపీ కేశినేని నాని తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. గోలంతా ఎందుకుమన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా అంటూ ఎద్దేవా చేశారు.దీంతో కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టాలు చేయడానికి చట్ట సభలో నువ్వొకడివని పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో అని వ్యాఖ్యానించారు. ఎలాగూ నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు, సచ్చింది లేదని ఎద్దేవా చేశారు. ‘కావాలంటే తాను ఇంగ్లీషులో రాసిపెడతా నిశానీ దొరగారూఅంటూ ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos