పుణె : నగరంలో గురువారం వరుణుడి మరణ మృదంగం మోగింది. బుధవారం రాత్రి నుంచి సంభవించిన వేర్వేరు ఘటనల్లో పదకొండు మంది మర ణిం చారు. నగరం చెరువులా మారింది. సహకర్ నగర్లో గోడ కూలి ఐదుగురు మరణించారు. వీరిలో తొమ్మిదేళ్ల బాలుడూ ఉన్నాడు. ఈ ప్రాంతంలోనే ఒక కారు వరద నీటికి కొట్టుకు పోవడంతో కారులోని వ్యక్తి కన్నుమూశాడు. మరొకరు వరదలో మునిగి అశువులు బాసాడు. మరో నలుగురు వేర్వే రు ప్రమాదాల్లో చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించింది. పరిస్థితి చక్కబడే వరకు అందుబాటులో ఉండా లని, లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.