ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ ఎంత…?

  • In Sports
  • July 31, 2020
  • 140 Views
ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ ఎంత…?

వసీం అక్రమ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) కంటే ఐపీఎల్ టోర్నీయే అత్యుత్తమం అని పేర్కొన్నారు. ఐపీఎల్ ఓ భారీ టోర్నీ అని, దానికోసం బీసీసీఐ ఎంతో ఖర్చు చేస్తోందని తెలిపారు. ఖర్చుకు తగిన స్థాయిలో ఐపీఎల్ కు విపరీతమైన ఆదాయం లభిస్తోందని, ఆ విధంగా వచ్చిన డబ్బును బీసీసీఐ తిరిగి క్రికెట్ కోసమే ఖర్చు చేస్తోందని, భారత్ లో దేశవాళీ క్రికెట్ కోసం వెచ్చిస్తున్నారని వివరించారు. ఈ కారణంగానే భారత దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని అక్రమ్ అభిప్రాయపడ్డారు. కానీ పాకిస్థాన్ లో పీఎస్ఎల్లో ఓ ఫ్రాంచైజీ కోసం ఖర్చు చేసే సొమ్ము ఎంతో తక్కువ అని వెల్లడించారు. ఆటగాళ్లను కొనుక్కునేందుకు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి రూ.80 కోట్ల బడ్జెట్ ఉంటుందని, పీఎస్ఎల్ ఫ్రాంచైజీల బడ్జెట్ ఆ దరిదాపుల్లో కూడా ఉండదని అక్రమ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos