ఆచరణకు నోచుకోని హామీలను నమ్మవద్దు

ఆచరణకు నోచుకోని హామీలను నమ్మవద్దు

న్యూఢిల్లీ: ఆచరణకు నోచుకోని హామీలను నమ్మవద్దని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హితవు పలికారు. సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘ఏ పార్టీతోనూ దాదాపు అన్ని శాసనసభ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. బీఎస్పీ అభ్యర్థుల విజయానికి అంతా కలిసి రావాలి. ర్యాలీకి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు సహజంగానే బీఎస్పీకి ఓటు వేస్తారు. మీరు కోరుకున్న బీఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా, మీ అభ్యర్థి గెలవాలన్నా ఇదొక్కటే చాలదు. మీరంతా ఒక్కొక్కరూ 1000 మందికి చెప్పి ఓట్లు వేయించాలి. ఇదే జరిగితే బీఎస్పీ గెలుపును ఎవ్వరూ ఆపలేర’న్నారు. ‘ఇతర పార్టీలకు డబ్బుల కొరత లేదు. పెట్టుబడి దారుల నుంచి వారికి నిధులు వస్తున్నాయి. పెట్టుబడిదారులకు వారి ప్రయోజనాలు వారి కుంటాయి. బీఎస్పీ గెలవాలంటే కార్యకర్తలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. కష్ట పడితేనే ఫలితం దక్కుతుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు చేసే ఆచరణకు నోచుకోని హామీలను నమ్మవద్ద’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos