డీఎంకే నాయకుడు భారతి తీరుపై నిరసన

డీఎంకే నాయకుడు భారతి తీరుపై నిరసన

హోసూరు : తమిళనాడు రాష్ట్రంలో దళితులను కించపరిచే విధంగా మాట్లాడి, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన డీఎంకే పార్టీ నాయకుడు ఆర్.ఎస్. భారతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అందులో భాగంగా కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని మేలుమలై గ్రామంలో దళితులు ఒక్కటై భారతిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను  చేతబట్టి నిరసన తెలిపారు. డిఎంకె పార్టీలో ఉంటూ దళితులను అవమాన పరిచే విధంగా ఆర్.ఎస్. భారతి మాట్లాడడం సరికాదని, వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. మేలుమలై గ్రామంలోనే కాకుండా హోసూరు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో భారతి వ్యాఖ్యలకు విరుద్ధంగా నిరసనలు హోరెత్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos