స్టాక్‌ మార్కెట్లకు దండిగా లాభాలు

స్టాక్‌ మార్కెట్లకు దండిగా లాభాలు

న్యూ ఢిల్లీ: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలను మూట కట్టుకున్నాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 52 వేల మార్కును దాటింది. సెన్సెక్స్ 610 పాయింట్లు లాభ పడి 52,154కి, నిఫ్టీ 151 పాయింట్లు పుంజుకుని 15,315 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 3.25 శాతం, ఫైనాన్స్ 2.66 శాతం, రియాల్టీ 1.53 శాతం పెరిగాయి.బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ (6.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.12%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.02%), బజాజ్ ఫైనాన్స్ (3.51%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.11%) బాగా లాభ పడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.79%), టీసీఎస్ (-1.29%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), ఏసియన్ పెయింట్స్ (-0.90%), టెక్ మహీంద్రా (-0.78%) చాలా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos