స్టాక్‌ మార్కెట్‌కు లాభాల బోణీ

స్టాక్‌ మార్కెట్‌కు లాభాల బోణీ

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.50 గంటల వేళలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 38,207వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు లాభంతో11,333 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.68 వద్ద దాఖ లైంది. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, అదానీ గ్యాస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎస్బీఐ, వేదాంత, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్ని గడించాయి. యూపీఎల్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అవెన్యూ సూపర్మార్ట్స్, సిప్లా, టీసీఎస్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు నష్ట పోయాయి. ఐటీ మినహా దాదాపు మిగతా రంగాల షేర్లన్నీ లాభాల్లోఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos