ముంబై : స్టాక్ మార్కె్ట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ – సెన్సెక్స్ 93 పాయింట్లు వృద్ధి చెంది 38,075 పాయింట్లకు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 11,263 పాయింట్ల వద్ద ఉన్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాల్లో ఉన్నాయి